గుండాల జూన్ 30(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. మొత్తం 75 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 70 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు 93% పాస్ పర్సంటేజ్ ని పాఠశాల నమోదు చేసింది. బి తనుష్9.2, ఎస్ శ్రీకాంత్9.2 గ్రేడ్ సాధించారు.అనంతరం ప్రిన్సిపాల్ హరికృష్ణ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలకు అనేక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదవాలని ఆయన కోరారు.
Navigation
Post A Comment: