CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:


మన్యం టివి మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతుబంధు పథకం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని,రైతు పెట్టుబడి సాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.రైతుబంధు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తూ,రైతు కుటుంబాలను ఇంకా సంపన్నులు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అని తెలిపారు. వానాకాలం పెట్టుబడి కోసం ఎకరానికి రూ.5000 రైతుబంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు బిడ్డ అవస్థలు పాలు కాకూడదు అని,ఎవరి దగ్గర పెట్టుబడి కోసం చేయి చాచి అడగకూడదు అని,గొప్ప మనసుతో వానాకాలం పంటకు ముందే రైతుల ఖాతాలో రైతుబంధు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల ఉన్న ప్రేమానురాగాలు ప్రాముఖ్యతను మరోసారి చాటుకున్నారని అన్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్త శుద్ధి ఉంటే రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కుల,మతాల బేధాలు లేకుండా పార్టీలకు అతీతంగా తెలంగాణలో ప్రతి రైతున్నకు రైతుబంధు పథకాన్ని అందించడం ఒక కేసీఆర్ మాత్రమే సాధ్యం అని తెలిపారు.రైతాంగం తరపున సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: