గుండాల జూన్ 20(మన్యం మనుగడ) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నే మెరుగైన విద్య విద్యార్థులకు అందుతుందని కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు తో కలిసి కళాశాల ప్రచార కరపత్రం ఫ్లెక్సీని ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యతోపాటు పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ కళాశాలల మాదిరి లక్షల రూపాయలు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆమె అన్నారు. అనంతరం ఆమె మండల కేంద్రంలోని గత సంవత్సరం పదో తరగతి విద్యార్థులను ఇంటింటికి తిరుగుతూ కళాశాలలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: