గత సంవత్సరం అనగా 2021-2022 లో గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో వేసిన మొక్కలను ఈరోజు గ్రీన్ భద్రాద్రి టీం స్వయంగా వెళ్లి పరిశీలించటం జరిగింది. అప్పుడు వేసిన మొక్కలు ఇప్పుడు భారీగా పెరిగి చెట్లుగా మారాయి. మొక్క వేసిన దగ్గర నుండి వాటిని చాలా శ్రద్ధగా క్రమంగా గ్రీన్ భద్రాద్రి టీం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటికి కావాల్సిన ఎరువును అందిస్తూ, ట్యాంకర్ సహాయం తో వాటికి నీటిని అందిస్తూ పశువులు విరిచేయకుండా వాటికి ట్రీ గార్డులు అమర్చి ఎల్లప్పుడూ పర్వవేక్షిస్తూ గాలి వానకు పడిపోయిన మొక్కలను కర్రల సహాయం తో నిలబెడుతూ వాటిని రక్షిస్తున్నామని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, PRO కడాలి నాగరాజు, రాసమల్ల రాము, RK నాయుడు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: