CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బి టి పి ఎస్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి,

Share it:

 



 బి టి పి ఎస్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి బి టి పి ఎస్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దమ్మక్కపేట గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

          ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ btps నిర్మాణం కొరకు రెండు పంటలు పండే భూములను కోల్పోవాల్సి వచ్చిందని దీనివల్ల స్థానికులకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. ఈ భూముల మీద ఆధారపడి స్థానిక గ్రామాల ప్రజలే కాకుండా వేరే ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఉపాధి పొందే వారు అన్నారు. భూములు కోల్పోవడం వలన స్థానిక ప్రజలు వేరే ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. btps యాజమాన్యం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక భూనిర్వాసితుల గ్రామాల ప్రజలకు, మరియు స్థానిక మండలాల యువత కు btps లో ఉపాధి అవకాశాలు కల్పించాలని btps యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే కలిసివచ్చే అందరినీ కలుపుకొని తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.

                 ఈ సమావేశం లో సిపిఐ ఎంఎల్ ప్రజా పందా మణుగూరు సబ్ డివిజన్ నాయకులు కురసం. రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: