భద్రాచలం, జూన్, 20, దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదని,తస్కరించ లేనిది ఒక జ్ఞానం మాత్రమే అని తెలిపారు, భద్రాచలం జగదీష్ కాలనీ మండల పరిషత్ యూ.పీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ రాజా శ్రీనివాసరావు,ఈ మేరకు విద్యా శాఖ వారు నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమంలో, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షర జ్ణానం పేరు తో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఎన్నో సామాజిక ,పర్యావరణ కార్యక్రమాలు చేస్తున్న జేడీ ఫౌండేషన్, విద్యాదానం లో కూడా ముందుండటము చాలా గొప్ప విషయమని, అందుకు మనస్ఫూర్తిగా ఫౌండేషన్ ని అభినదిస్తున్నామని తెలిపారు, ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ వారు అందజేసిన పలకలు, పుస్తకాలు, పెన్ లు ఇతర స్టేషనరీ ని పిల్లలకు అందజేసారు. ఈ కార్యక్రమంకి ఆర్థిక సహకారాన్ని అందించిన ప్రభాకరన్,మోహన్ నిష్ఠల, సత్యమూర్తి కు జేడీ ఫౌండేషన్ భాద్యుడు మురళీ మోహన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు హన్సి, కడాలి నాగరాజు, యూసుఫ్ మియా, అంబికా సురేష్, , స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఖాసిOబీ, అంగన్వాడీ టీచర్ మాధవి, ఉపాధ్యాయులు జ్యోతి కుమార్, లక్ష్మి, రామకృష్ణ, రమేష్ ,జె, శ్రీను, టి శ్రీనివాస రావు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: