మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: సత్తుపల్లి నుండి కొండపల్లి రైల్వే లైన్ మంజూరు చేయాలని రైల్వేలైన్ సాధన కమిటీ చైర్మన్ కొదమసింహం పాండు రంగాచార్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండు పర్యాయలు దాటిన కనీసం రైల్వే లైన్ మంజూరు చేయలేకపోయిందన్నారు. కొత్త రైల్వే లైన్ మంజూరు లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. పాండురంగాపురం- భద్రాచలం రైల్వే లైన్ కు నిధులు మంజూరు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం రైల్వే లైన్ లో మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, కళ్ళం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: