గుండాల జూన్ 20(మన్యం మనుగడ) మండలం పరిధిలోని బాటన్నా నగర్ (కృష్ణాపురం) పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు సత్తు లాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ కృష్ణయ్య, మామ కన్ను సర్పంచ్ ముత్యమా చారి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు అనంతరం ఎంఈఓ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాష ను ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం, అర్హులైన వారందరికీ ఉపకార వేతనాలు ఇవ్వబడతాయి అన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నందున తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
Post A Comment: