మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 21, మండల పరిధిలోని గుండెపుడి గ్రామానికి చెందిన కొమ్మినేని సీతారామయ్య సోమవారం రాత్రి హైదరాబాదులో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. మండల ప్రజలందరికీ సుపరిచితుడు సుమారు దశాబ్ద కాలానికి పైగా మండల కేంద్రంలో ఎరువులు, పురుగు మందుల వ్యాపారాన్ని ఆయన నిర్వహించారు. మంగళవారం వెంగన్నపాలెం గ్రామంలో సీతారామయ్య భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులు సీతారామయ్య భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీప్ జడ్జీ కాళ్ళూరు ప్రభాకర్ రావు, కాళ్ళూరు వెంకటేశ్వరరావు, వైరా మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్లాల్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వళ్ళ దుర్గాప్రసాద్, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యదళ్ళపల్లి వీరభద్రం, కాంగ్రెస్ వైరా నియోజకవర్గ నాయకులు రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్, తదితరులు ఉన్నారు.
Post A Comment: