గుండాల జూన్ 21(మన్యం మనుగడ) పినపాక నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరం ఏకతాటి మీద నిలబడి కృషి చేద్దామని పినపాక నియోజకవర్గ ఇన్చార్జి వట్టం నారాయణ దొర అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని నాయకులను కోరారు. పార్టీ క్యాడర్ను బలోపేతం చేసేందుకు నాయకులు ముందుండి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శులు ఎస్కే సంధాని, వాసిరెడ్డి చలపతిరావు, మండల అధ్యక్షులు సాంబయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఇల్లందుల అప్పారావు, పార్టీ నాయకులు ఇల్లందుల నరసింహులు, మొలకం మధు, పుల్లయ్య, పెద్ద బుచ్చయ్య, కృష్ణ , లక్ష్మయ్య , అశోక్, లక్ష్మయ్య, లాలూ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: