CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అధిక సాంద్రత పత్తి విత్తనాలు ఏవో ఎస్ రఘు దీపిక..

Share it:

 


మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 16, వ్యవసాయ శాఖ మరియు నూజివీడు విత్తన కంపెనీ భాగస్వామ్యం తో ఈ వానాకాలం రైతులకు నూతన విధానం అయిన అధిక సాంద్రత పత్తి విత్తనాలు అందజేస్తామని, దీనికి గాను ఎకరానికి ఐదు పాకెట్స్ విత్తనం అవసరం అవుతుందని, అందులో మూడు పాకెట్స్ ధర రైతు పంట వెసి, వ్యవసాయ విస్తరణ అధికారి మరియు మండల వ్యవసాయ అధికారి ధృవీకరించిన తరువాత రైతు బ్యాంక్ ఖాతా లో జమ చేయబడతాయని అన్నారు. అందుకు గాను మాచినేనిపేట క్లస్టర్ లోని గ్రామాలు అయిన కరివారిగుడెం రెవెన్యూ, మాచినేనిపేట రెవెన్యూ, పడమట నర్సాపురం రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, కావున ఆసక్తి ఉన్న రైతులు మాచినేనిపేట క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గారికి దరఖాస్తు చేసుకోగలరని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ రఘు దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ విత్తనాలు తేలిక నేలలు కలిగిన రైతులకు మాత్రమే సిఫార్సు చేయబడినవి. ఈ అంశం పై 17-06-2022 నాడు కొమ్ముగుడెం గ్రామ పంచాయతీ నందు ఉదయం 9: 00 గంటలకు సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.

Share it:

TS

Post A Comment: