CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు..

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మణుగూరు, పినపాక మండలాల భద్రాద్రి పవర్ ప్లాంట్ సెక్యూరిటీ సిబ్బంది ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా బిటిపిఎస్ సెక్యూరిటీ సిబ్బంది గా మేము గత ఏడు సంవత్సరాల నుండి బిటిపిఎస్,బిహెచ్ఈఎల్ లో సివిల్ సెక్యూరిటీ గార్డులుగా 33 మంది ఉపాధి పొందుతున్నాము అని, త్వరలో ప్లాంటు ను జెన్కో కు అప్పగిస్తారు అని,దానివలన మా యొక్క ఉపాధి కోల్పోతామని,మాకు వేరే ఆధారం కూడా లేదని తెలిపారు.సమస్య ను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు వారు విన్నవించారు.సమస్య పై సానుకూలంగా స్పందించిన విప్ రేగా త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి సమస్య ను తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వారికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిటిపిఎస్ సివిల్ సెక్యూరిటీ గార్డుల తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: