మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,అశోక్ నగర్ లో మణుగూరు మండలం జడ్పీటీసీ పోశం. నరసింహారావు మేనల్లుడు గారపాటి ప్రసాద్ (40) సంవత్సరాలు గుండెపోటుతో మరణించడం తో వారి నివాసానికి వెళ్లి,మృతుడి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: