మన్యం మనుగడ కరకగూడెం:అపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం అని ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, రేగా కాంతారావు అన్నారు.
కరకగూడెం మండల పరిధిలోని కొర్నవల్లి గ్రామనికి చెందిన కంటెం అనిత కు మంజూరైన 36,000/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు. రేగా కాంతారావు,చేతుల మీదగా గురువారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి కింద అందించే సాయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని,సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక, సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య,
టిఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం.రాంబాబు,ప్రసాద్,క్రిష్ణ, శ్రీను,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: