మన్యం మనుగడ కరకగూడెం:మండల పరిధిలోని తుమ్మలగూడెం గ్రామ పంచాయతీలో గల తుమ్మలగూడెం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల నందు జరుగుతున్న మనఊరు మన బడి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీపీ రేగా కాళిక,జడ్పిటిసి కొమరం కాంతారావు స్థానిక సర్పంచ్ తోలెం.సావిత్రి తో కలసి పరిశీలించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన బడి ప్రణాళిక కింద మంజూరైన పనులను త్వరగా పూర్తి చేసి అందించాలన్నారు. అలాగే పనుల్లో నాణ్యత పాటించకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుంధతి, అంగన్ వాడి టిచ్చర్ తొలెం.అమరావతి, ఎంపిటీసి కొమరం మునింద్ర-సురేష్ స్థానికులు నిట్టా ప్రభాకర్, మాజీ ఎంపిటీసి నిట్టా. ఏడుకొండలు తోలెం నారాయణ,లింగయ్య గ్రామస్తుల పాల్గొన్నారు.
Post A Comment: