CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులు కంపోస్ట్ ఎరువు వాడే విధంగా అవగాహన కల్పించాలి :- జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య.

Share it:

 


గుండాల జూన్ 4(మన్యం మనుగడ) రైతులు భారీగా కంపోస్ట్ ఎరువు వాడుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అధికారులను కోరారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన సాయన పల్లి పంచాయతీ డంపింగ్ యార్డ్ లో కంపోస్ట్ ఎరువు తయారీ ఆయన పరిశీలించారు. పంచాయితీ సర్పంచ్ రామ్మూర్తి, కార్యదర్శి నరేష్ ను చైర్మన్ అభినందించారు. భారీగా కంపోస్ట్ ఎరువును తయారు చూస్తున్నందుకు అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ జిల్లా పరిషత్ చైర్మన్ కు కంపోస్టు ఎరువు ప్యాకెట్ లు అందజేశారు. తక్కువ ధరలో వస్తున్నందున రైతులు తప్పకుండా ఎరువు కొనుగోలు చేసి వాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క, ఎంపీపీ భక్తి సత్యం, తాసిల్దార్ కిషోర్, ఎంపీడీవో హజరత్ వలి, సర్పంచ్ రామ్మూర్తి, ఏ పీ ఓ రవితేజ, కార్యదర్శి నరేష్ , తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: