మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 20, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ సోమవారం మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన యల్లంకి బిక్షమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకొని వారింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొల్ల రాంబాబు గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకొని వారింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు, ఎంపిపి లావుడ్యా సోనీ, లకావత్ గిరిబాబు, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, జూలూరుపాడు ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, వెంగన్నపాలెం సర్పంచు గలిగె సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: