మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 20, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ సోమవారం మండలంలో జరిగిన పలు శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గంగారం తండా లో వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వెంగన్నపాలెం గ్రామంలో ఒక వేడుక లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు, ఎంపిపి లావుడ్యా సోనీ, లకావత్ గిరిబాబు, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, సర్పంచు గలిగె సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: