మన్యం మనుగడ కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన క్రీడా పాలసీ లో భాగంగా గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలు ప్రారంభించాలనే నిబంధనతో గురువారం ఎంపిపి రేగా కాళిక చేతులమీదుగా బట్టుపల్లి, సమత బట్టుపల్లి పంచాయతీ క్రీడా ప్రాంగణలను సర్పంచులు తొలి నాగేశ్వరరావు పోలబోయిన శ్రీవాణి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల యువకులను విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో క్రీడా పాలసీని తీసుకొచ్చిందని ఆమె అన్నారు.ప్రతి పంచాయితీలో ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని తద్వారా గ్రామీణ క్రీడాకారులను తయారుచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా మండలంలో రెండు క్రీడా ప్రాంగణాల ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అని ఆమె అన్నారు. త్వరలోనే అన్ని పంచాయతీలలో గుర్తించి స్థలాలను గుర్తించి క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అనంతరం క్రీడాకారులతో మైదానాలను పరిశీలించి యువ క్రీడాకారులతో వాలీబాల్, కోకో, క్రీడాకారులతో కాసేపు కార్యదర్శులు సర్పంచులతో టీములుగా ఏర్పడిఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీను ,ఎంపీఓ చిరంజీవి,ఏపీఓ, శ్రీను, కార్యదర్శులు,తరుణ్, సర్పంచులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: