మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రేగా కాళిక, ప్రొఫెసర్ జయశంకర్,ఫోటో కు, తెలంగాణ తల్లి ,ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు.తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఉషా శారద, జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కరకగూడెం పోలీస్ స్టేషన్లో, ఎస్ఐ,నాగ బిక్షం, జెండా ఆవిష్కరించారు కరకగూడెం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఓకే రామనాథం రైతు వేదిక లో ,ఏ ఈ ఓ ప్రశాంత్ 16 పంచాయతీలలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఎంపిపి రేగా కాళిక తాసిల్దార్ ఉషా శారద, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం లో ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని వారన్నారు. అమరవీరులు త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేనని వారి త్యాగాల ఫలమే మనకు స్వరాష్ట్రం అందిందని, తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శైలజ, ఆయుర్వేదిక్ డాక్టర్ కుమారస్వామి, డిప్యూటీ తాసిల్దారు.సంధ్య, ఆర్ఐ లు, రాజు,హుస్సేన్ , వీఆర్వోలు ,వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు ,సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: