మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం గ్రామంలో ఆదివాసి నాయకపోడు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో భాగంగా సండ్ర చెట్లు తేవడం కోసం అడవికి బయలు దేరిన జమ్మిగూడెం గిరిజన ఆదివాసీ నాయకపోడు భక్తులు మరియు గిరిజనేతర భక్తుల సైతం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ మిద్దిన రాములు మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాలో భాగమైన శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో భాగాంగా భక్తలు తమ భక్తిని చాటు కొనుటకు శుక్రవారం నిప్పుల గుండాలపై నడిచే కార్యక్రమం నిర్వహణ ఉంటుందని, దానికోసం సరువులు (సండ్ర చెట్లు) పట్టుకొని రావడానికి వెళ్లడం జరుగుతుందని, క్షేమంగా తిరిగి రావాలని స్వామికి మొక్కి ట్రాక్టర్లుతో స్వామి వారి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షణలు చేసి అడవికి చేరుకోవడం జరుగుతుందని, అక్కడ మూడు గ్రూప్ లుగు విడిపోయి మూడు సరువులు (సండ్ర చెట్లను) వ్రేలతో సహా పెకిలించుకు రావడం జరుగుతుందని. అదేవిదంగా అడవిలోకి వెళ్లిన భక్తులందరూ విందు భోజనాలు ముగించుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిద్దిన కొండయ్య, మిద్దిన లక్ష్మణ్ రావు, రాజిని నాగేశ్వరావు, దానపు జగపతి, మిద్దిన రాము, దాది చంటి, యువకులు మిద్దిన వెంకీ, బేతి రవీంద్ర, తిరుపతి, గణప నవీన్, చింటూ, రాంబాబు భక్తులు అనేక మంది పాల్గొన్నారు.
Post A Comment: