భద్రాద్రికొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,
భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ రైల్వే లైన్ రామానుజవరం, కొండాయిగూడెం నిర్వాసితులకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి విజ్ఞప్తి చేశారు. బుధవారం రైల్వే లైన్ నిర్వాసితులతో మణుగూరు లో ఏర్పాటుచేసిన సమావేశంలో మోరా రవి మాట్లాడుతూ .. గత ఎన్నో సంవత్సరాల నుండి భూమినే నమ్ముకొని సాగు చేసి కుటుంబాలతో జీవనం సాగిస్తున్న రైతుల భూమిని రైల్వే లైన్ కొరకు, రైతుల, ఇతర స్థానిక ప్రజల వ్యవసాయ భూములతో పాటు, నివాసాలు, నివాస స్థలాలు లాక్కొని అధికార యంత్రాంగం ఎంతో కొంత ఇచ్చినంత పరిహారం, ఎక్స్ గ్రేషియా తీసుకొని తప్పుకోండి అని నచ్చచెబుతూ స్థానిక ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. btps కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వ అధికార యంత్రాంగం చట్టాలను పట్టించుకోకుండా, ల్యాండ్ ఎక్యూప్ మెంట్ చట్టం1994 గాని, 2013 భూసేకరణ చట్టాన్ని గాని, పరిగణలోకి తీసుకోకుండా అధికారులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. రామనుజవరం ప్రజల నిర్వాసిత సమస్యను తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రజల యొక్క వినతి మేరకు btps యాజమాన్యానికి, సంబంధిత అధికారులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి షోకాజ్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవించి, చట్టప్రకారం వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేవరకు, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ వారికి అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. బి టి పి ఎస్ రైల్వ్ లైన్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని, సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్ మండల కార్యదర్శి బొల్లం సైదులు , పురం బిక్షం, మలికంటి రమేష్ , పెంట్యాల కృష్ణ , జూపల్లి ముత్తయ్య, దంతసరపు వీరన్న , పోతనబోయిన కోటయ్య, బొల్లంపెద్ద మదార్, తోటకూరి కోటయ్య , సిరికొండ మట్టయ్య , మలికంటి సైదులు, రామానుజవరం, కొండాయిగూడెం బి టి పి ఎస్ రైల్వే లైన్ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: