మన్యం టీవీ దుమ్ముగూడెం ::
ఆదివాసీ యువకులపై దాడి చేసి తల పగలగొట్టిన వారి కుటుంబాన్ని పై ఎస్సీ ఎస్టీ కేసు కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏఎస్పి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు సోంది మల్లు మాట్లాడుతూ చిన్న బండిరేవు గ్రామానికి చెందిన బాడిస సాయి చందు అనే ఆదివాసి యువకుని తల పగలగొట్టి,అక్కడ ఉన్నా మరికొందరు యువకుల్ని కూడా కర్రలతో దాడి చేసిన నంద్యాల శ్రీను కుమారుడు బోసు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక గిరిజన శుభకార్యం వద్దకు వచ్చి ఆదివాసి అమ్మాయిలపై కామెంట్ చేస్తు,వారు కూర్చున్న వద్దకు వచ్చి మోటార్ బైక్ తో స్వల్పంగా ఢీకొని ఇదేంటి అని అడగ్గా వారిపై దురుసుగా ప్రవర్తించి అడుగుతున్న క్రమం లో పెద్ద కర్రతో దాడి చేశారని ఆరోపించారు ఆదివాసుల పై ఏదో ఒక రూపంలో అడుగడుగునా గిరిజనేతరులు కుట్రలు పన్ని దాడులు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్న వారు బాడిస నరసింహారావు, చంటి, జంపన్న, రాజకుమార్, వీరయ్య, నాగరాజు తదితరు పాల్గొన్నరు .
Post A Comment: