మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కూకట్ల చుక్కమ్మ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం మృతి చెందినది. వారి కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు కలిసి, పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించి దహనసంస్కారాల కొరకు ఖర్చుల నిమిత్తం మూడువేల రూపాయలు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ ఆర్థిక సహాయంగా అందజేశారు. నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బాడిశ నవీన్, సలహాదారులు జై భీమ్ రామ్మోహన్, మరియు ట్రస్ట్ సభ్యులు ముయిబోయిన శివ, కొమరం నితిన్, గ్రామస్తులు జానపట్ల జయరాజ్, మంచాల నాగేంద్రబాబు, జోగారావు, స్నేహ కుమార్, ఇప్ప సమ్మయ్య, నరసింహారావు, గుంటపూడి తిరుమల,లక్కమల్ల వెంకటేష్, కర్రీ.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: