మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:అశ్వాపురం మండలం నెల్లిపాక పంచాయతీ గ్రామానికి చెందిన అయితంరాజు నీలాంబరం, వెంకటమ్మ వృద్ధులను వారి ఇంటినుండి వారి పెద్ద కోడలు మరియు ఇద్దరు మనవళ్లు నిన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఈ వృద్ధులను కొట్టి గెంటివేసినారు.దిక్కు తోచని పరిస్థితులలో అదే రాత్రి ఎక్కడికి వెళ్లాలో తెలియక అశ్వాపురంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పడుకున్నారు.రాత్రి నుండి వారు భోజనం నీరు లేక మండుటెండల్లో అల్లాడిపోతున్న పరిస్థితులలో స్థానిక ఉపసర్పంచ్ భూక్యా చందు నాయక్ వారిని చేరదీసి వారికి భోజనం ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు..అనంతరం ఇట్టి విషయంపై పోలీసు ఆదికారులకు తెలియజేయడం జరిగింది అని తెలిపారు.
Post A Comment: