మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మండల అద్యక్షులు చిట మట రఘు మాట్లాడుతూ.దేశం కోసం తన నానమ్మ ని పోగొట్టుకున్నాడు.
కానీ ఆ నానమ్మ నుండి వొచ్చిన మొండి పట్టుదలని, పోగొట్టుకోలేదని దేశం కోసం తన తండ్రిని త్యాగం చేసాడు కానీ తన తండ్రి చూపించిన ముందు చూపుని కాదు అని అత్యున్నత పదవిని త్యాగం చేసిన అమ్మకి కొడుకుగా తమని ద్వేషించిన వాళ్ళని సైతం ప్రేమించాడు కానీ తన ప్రజల మీద ప్రేమని మాత్రం ఎప్పుడూ వొదులుకోలేదు అని మనుషులందరూ ఒకేలా ప్రేమించే మంచి మనసుని కొంతమంది ఎంత నిందించినా,ఎంత ద్వేషించినా చిరునవ్వుతో భరించాడు కానీ ప్రేమించటం మాత్రం మానుకోలేదని,రాజుగా పుట్టి కూడా,తన వారసత్వాన్ని త్యాగం చేసి,ప్రజల్లో ఒకడిగా ప్రజల కోసం బతుకుతున్న ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన దేశం కోసం దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు చిటమట రఘు,మాజీ మండలాధ్యక్షులు వావిలాల నర్సింగరావు,మండల యూత్ నాయకులు చేల వినయ్,టౌన్ అధ్యక్షుడు తాళ్లపల్లి నరేందర్,టౌన్ కార్యవర్గ కార్యదర్శి సరికొప్పుల శ్రీనివాస్, టౌన్ యూత్ అధ్యక్షుడు బండారు లక్కీ,సీనియర్ నాయకులు సాధనపల్లి లక్ష్మయ్య,తూర్పాటి కుమారస్వామి,సునారికాని శ్రీను యూత్ నాయకులు నాగవత్ కిరణ్,ఎస్డి ముస్తఫా,
సునీల్,శేఖర్,ఖయ్యూమ్,గణేష్,వాసు,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: