గుండాల జూన్ 7(మన్యం మనుగడ) జలగం వెంగళరావు (జె వి ఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు మోటార్లను పంపిణీ చేశారు. అనంతరం జెడ్ పి టి సి రామక్క మాట్లాడుతూ స్వర్గీయ జలగం వెంగళరావు ఫౌండేషన్ చైర్మన్ ప్రసాదరావు ఆధ్వర్యంలో వారి సభ్యులు మోటార్లను అందించడం అభినందనీయమని ఆమె అన్నారు. మారుమూల ప్రాంతం లోని ఆదివాసీ ప్రజల సమస్యలను గుర్తించి మోటార్లను అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఆదివాసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ సత్యం, సర్పంచ్ సీతారాములు, కార్యదర్శి ఇ శ్రీనివాస్, కారోబార్ నాగరాజు, రైతులు పాల్గొన్నారు
Post A Comment: