దమ్మపేట జూన్ 07 ( మన్యం మనుగడ ) : MP నామా నాగేశ్వరరావు సిఫార్సు మేరకు నూతనంగా ఎన్నికైన దిశ కమిటీ సభ్యులు, ఫీడ్ ద నీడ్ చైర్మన్ మందలపల్లి ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ ఈ రోజు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే , మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు వారి స్వగృహంలో కలిసి పూలమాలలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమం లో TRS పార్టీ మందలపల్లి SC సెల్ అధ్యక్షుడు మద్దెల పుల్లారావు, బలుసు గోపి, పర్వతనేని వరప్రసాద్, నందికొల రామారావు, చింతలచేరువు భాగ్యరాజు, కనపర్తి ధర్మారావు, అయినంపూడి వెంకటేశ్వర్లు, దారా వెంకటేశ్వరరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: