గుండాల జూన్ 7(మన్యం మనుగడ) ప్రజలతో మమేకమై పనిచేస్తామని ఎస్సై కిన్నెర రాజశేఖర్ అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని గణపురం గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామస్తులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలకు తావివ్వకుండా అంతా కలిసికట్టుగా ఉండాలని వారికి సూచించారు. ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా గ్రామాలలో తిరుగుతూ యువకులు ఉద్యోగాలు సాధించే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సమస్యలేమైనా ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి తెలియపరచాలని కోరారు
Post A Comment: