మన్యం మనుగడ,మణుగూరు:
తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ది: 02-06-2022 న హైదరాబాద్, రవీంద్రభారతి ప్రధాన మందిరంలో RK కళా,సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తెలంగాణా సంబరాలలో "తెలంగాణ సేవా రత్న" అవార్డ్ ను తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా హ్యాండ్ రైటింగ్ హుస్సేన్ కు బహూకరించారు.
హ్యాండ్ రైటింగ్ హుస్సేన్ గత 12 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ మినహాయించి,ప్రభుత్వ, బాలవెలుగు, గురుకుల,హాస్టల్,ఆశ్రమ,అనాధ,వి యల్ సి సెంటర్స్ విద్యార్థులకు వేలాది మందికి ఉచితంగా హ్యాండ్ రైటింగ్ శిక్షణ అందిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు,యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్,సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ,మా ఈసీ మెంబర్,నటుడు మాణిక్,RK కళా, సాంస్కృతిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: