మన్యం మనుగడ, మంగపేట.
గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా మైదానాల ఏర్పాటు లో బాగంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసి క్రీడా కారులకు సకల సౌకర్యాలు కల్పించి పల్లెల్లోనుండి క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పంపించాలనే దృఢ సంకల్పం తో ప్రభుత్వం తెలంగాణారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. గ్రామీణ క్రీడా మైదానం ఏర్పాటు లో భాగంగా మంగపేట మండలం లోని రాజుపేట గ్రామం లో జూన్ 2వ,తేదీన క్రీడా మైదానం ప్రారంభోత్సవంకానుంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంనకు అందరూ ఆహ్వానితులే, ప్రారంభం తదనంతరం ఆసక్తి కలిగిన స్వగ్రామం అభ్యర్థులు తమ పేరును నమోదు చేసుకొని వివిధ ఆటల్లో పాల్గొనాలని రాజుపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉపేంద్ర తెలియజేశారు.ఆసక్తి కల్గిన అభ్యర్థులు పోటీలలో పాల్గొని గెలిచిన వారికి బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు.
Post A Comment: