- 4,85,000/- విలువగల 20 రకాల స్పేర్ పార్ట్స్ దొంగిలించారు..
మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండల పరిధిలోని దుమ్ముగూడెం గ్రామంలో ఉన్నటువంటి ఎస్ ఎల్ ఎస్ పవర్ ప్లాంట్ దొంగతనం జరిగింది. పవర్ ప్లాంట్ కు సంబంధించిన యంత్రాలను, పవర్ తయారీలో ఉపయోగించే అన్ని రకాల స్పేర్ పార్ట్స్ కంపెనీ ఉద్యోగుల రూమ్స్ సమీపంలో ఉండే ఒక ఒక గోడౌన్లో లో ఉంచడం జరుగుతుంది. అవసరమైన సమయంలో ఆ స్టోర్ రూమ్ దగ్గరకు వెళ్లి వస్తువులను తీసుకొస్తుంటారు, ఈ క్రమంలో 14.06.2022 నా ఉదయం 10గంటలకి పరికరాల కోసం ప్రాజెక్ట్ మేనేజర్ కే జనార్దన్ రావు వారి సిబ్బంది కలిసి గోడౌన్ గది దగ్గరకు వెళ్లగా, హా గది ప్రహరీ గోడకు రంద్రాలు చేసి ఉన్నాయి. అన్ని తనిఖీ చేయగా అందులో ఉండే 20 రకాల స్పేర్ పార్ట్స్ మొత్తం గుర్తుతెలియని దొంగలు దొంగిలించారని వాటి విలువ 4 లక్షల 85 వేల విలువ ఉంటుందని ప్రాజెక్ట్ మేనేజర్ ఫిర్యాదు చేయగా దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Post A Comment: