- వైట్ నగరం గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించిన జెడ్పిటిసి తెల్లం సీతమ్మ, రేసు ఎంపీపీ లక్ష్మి..
మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లి పంచాయతీ పరిధిలోని కే వీరభద్రపురం పాఠశాలలో లో మన ఊరు మన బడి ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మౌలిక సదుపాయాలు కొరకు మంచినీటి సదుపాయం, కరెంటు ఏర్పాటు, వంటశాల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం కొరకు మంజూరైన 7 లక్షల నిధులతో చేపట్టే పనులకు జెడ్పిటి సి, ఎం పి పి కొబ్బరి కొట్టి ప్రారంభించారు. అలానే సింగవరం పంచాయతీ పరిధిలోని వైట్ నగరం గ్రామంలో లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిధులతో 5లక్షల రూపాయలతో 120 మీటర్ల సీసీ రోడ్డు పనులకు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందుతాయి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచులు సోడి కొండయ్య, జుంజురి లక్ష్మి, ఎం పి టి సి మడకం రామారావు ఉప సర్పంచ్ వెంకట్ లక్ష్మి టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రాముడు పార్టీ నాయకులు జై సింహ, విద్య కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: