సిపిఎం చండ్రుగొండ మండల కమిటీ... మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : ఈరోజు మండల సర్వసభ్య సమావేశం లో చండ్రుగొండ ప్రధాన కేంద్రంలో ఉన్న సమస్యలు ఐనా డ్రైనేజ్, అంగన్వాడి బిల్డింగ్, సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని మెమోరాండం రూపంలో ఎంపీడీవో గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ సభ్యులు పెద్దిని వేణు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు తక్షణం స్పందించి వెంటనే అంగన్వాడీ కేంద్రాలు కు సంబంధించిన బిల్డింగ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రానున్న వర్షాకాలంలో జూలూరుపాడు ప్రధాన రహదారిపై వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుంది.దానిపైన కూడా ప్రభుత్వం స్పందించి డ్రైనేజ్ నిర్మించాలని వారు అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎంపీడీవో కార్యాలయంను ముట్టడిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రాయి రాజా, అయ్యన్నపాలెం శాఖ కార్యదర్శి చల్లపల్లి రాజా, దాసరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: