మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం లో అడివి రామారం గ్రామంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజాపందా నాయకులు సాయన్న మాట్లాడుతూ ఒకపక్క కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడం సబబు కాదని అని ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అలానే ఏజెన్సీ ప్రాంతంలో భద్రాచలం నుండి మారాయిగూడెం మీదగా లక్ష్మినగరం వరకు ఆర్టీసీ బస్సు నడపాలని దీని వలన అనేక మంది ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ప్రజలకు రవాణా సౌకర్యం కలుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శంకర్, ముదిరాజ్, సుధాకర్, కుమారి, అనూష, సర్వేశ్వరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: