మన్యం టీవీ దుమ్ముగూడెం :: దుమ్ముగూడెం మండలం కే లక్ష్మీపురం గ్రామం లో శనివారం యువజన కాంగ్రెస్ నాయకులు కనుబుద్ది దేవా గృహం లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ గురించి గ్రామస్థులకు తెలియజేశారు రైతు డిక్లరేషన్ కరపత్రాలను గ్రామస్తులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు జరిగే లాభాలను గురించి ప్రజలకు అందే సంక్షేమ పథకాలను గురించి తెలియజేశారు రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు ఈ కార్యక్రమం లో దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సీతారామారావు , కనుబుద్ది దేవా, తెల్లం నరేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: