మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో మల్లెలమడుగు గ్రామం లో ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన 39500రూపాయల విలువగల మూడు చెక్కులను శనివారం సంబంధిత బాధితులకు వారి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది.కత్తుల ఎల్లయ్య 19500రూపాయలు,దండి విమలమ్మకు 7000 రూపాయలు,గాడుధుల వెంకన్న కు 13000 రూపాయల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కోడి అమరేందర్ మాట్లాడుతూ పేదప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృత నిశ్చయంతో పని చేస్తుందని,ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్ధి పొందనిలేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా కెసిఆర్ ఆదుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు.ఈ కార్యక్రమం లో ,స్థానిక సర్పంచ్ కోడి కృష్ణవేణి,ఉప సర్పంచ్ చావా రాఘవులు, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, టి ఆర్ యస్ మండల కార్యదర్శి, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మల్లెలమడుగు టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షడు ఇసంపల్లి పున్నారావు ,మండల యస్ సి సెల్ అద్యక్షులు గొరెముచ్చు వెంకట రమణ ,నాయకులు చుంచు రామ్మూర్తి ,జినక ప్రభాకర్ ,అరిగెల గురుప్రసాద్ ,కుక్కల రాంబాబు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: