దమ్మపేట జూన్ 27 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండల కేంద్రంలో మడకం ప్రసాద్ అధ్యక్షతన ఆదివాసి జేఏసి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి దమ్మపేట మండల ఆదివాసి జేఏసి అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలోని ఆదివాసీలు తమ తాత ముత్తాతల కాలం నుండి సాగుచేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు ఉన్నప్పటికీ అర్హులైన వారికి డిజిటల్ పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రశ్నిస్తున్న ఆదివాసీల గొంతునొక్కేందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ అరెస్టులను యావత్ ఆదివాసి సమాజం ఖండిస్తుందని వెంటనే రామన్నగూడెం ఆదివాసులను విడుదల చేయాలని, అదేవిధంగా రామన్నగూడెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అర్హులైన ఆదివాసీలందరికీ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని లేనిపక్షంలో దశలవారీగా ఆదివాసీ సంఘాల సమన్వయంతో ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో సోయం రామ్మూర్తి, తాటి పోతురాజు, పర్శిక మారేశ్, వంకా వరాలబాబు, వాడే వీరాస్వామి, వంకా ప్రశాంత్, కుంజా చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: