మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మంగళవారం నాడు పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూసా రాము కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మంజూరైన బులేరో వాహనాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని అన్నారు. దళితులకు మంచి చేయాలనే సంకల్పంతో దళిత బంధు పథకాన్ని చేపట్టి రూ.17,800 కోట్ల నిధులు కేటాయించారని ఆయన అన్నారు. దశల వారీగా ఈ పథకాన్ని అందరికీ అందించి దళితులలో పేదవారు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. దళిత బంధు పథకంతో దళితులు భవిష్యత్ తరాలలో ఉన్నత వర్గాలకు దీటుగా ఎదుగుతారని అన్నారు. వాహనాలు, కిరాణా దుకాణాలు, సెంట్రింగ్ యూనిట్లు , మరియు తదితర వ్యాపారాలు చేసుకొని దళితులు వాటికి యజమానులుగా మారుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: