CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం..

Share it:


  • న్యూమాటిక్ ప్లాంటర్ పరికరం యొక్క ప్రయోజనాలను రైతులకు వివరిస్తున్న జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బంది..


జూలూరుపాడు జూన్ 30, మన్యం మనుగడ ప్రతినిధి, రైతులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ప్రయోగాత్మకంగా నూతన అధిక సాంద్రత పత్తి సాగు విధానం పై రైతులకు అవగాహన కల్పిస్తున్న విషయం విధితమే. దీనిలో భాగంగా సోమవారం జూలూరుపాడు మండలంలోని మాచినేని పేట తండా గ్రామంలోని లాకవత్ ముకుంద అనే రైతు పొలంలో న్యూ మాటిక్ ప్లాంటర్ అను వ్యవసాయ పరికరం ద్వారా అధిక సాంద్రత పత్తి విత్తనాలను విత్తి యంత్ర పరికరం యొక్క ప్రత్యేకతల పై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరించారు. ఈ పరికరం ద్వారా విత్తనాలను విత్తడం వలన భూమిలో విత్తనం సమాంతర లోతు లో పడి విత్తనం అంతా ఒకేసారి మొలకెత్తుతుందని, మొలక శాతం గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఈ ఒక్క పరికరం ద్వారా ఎలాంటి వ్యవసాయ కూలీలు అవసరం లేకుండా రోజుకు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు విత్తె అవకాశం ఉందని అన్నారు. తద్వారా రైతుకు అరక, కూలీల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. నూతన అధిక సాంద్రత వ్యవసాయ విధానంలో రైతులందరూ వ్యవసాయ శాఖ సూచనలు, సలహాలు పాటించి ఖర్చులు తగ్గించుకొని, పంట దిగుబడి పెంచుకొని లాభాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు జి లాల్ చంద్, కె.వి.కె డైరెక్టర్ లక్ష్మీనారాయణ, కొత్తగూడెం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు టి కరుణశ్రీ, జూలూరుపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ రఘు దీపిక, ఎస్ వి కె సైంటిస్ట్ శ్రీనివాస రావు, వ్యవసాయ విస్తరణ అధికారులు బి గోపికృష్ణ, ఎస్ లావణ్య, ఎం ఎ గౌస్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: