మన్యం మనుగడ, అశ్వారావుపేట: తెలంగాణ పోరాటంలో తనవంతు కృషిని అందించిన ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్, వర్ధంతిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుడు ముబారక్ బాబా ఆచార్య జయశంకర్ సార్కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ముబారక్ బాబా మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సార్ అని ఆయన అన్నారు. వెలకట్టలేని సేవలు, అత్యున్నత వ్యక్తిత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ సొంతమని అన్నారు. పుట్టుక నీది, మరణం నీది, బతుకంతా తెలంగాణది, జోహార్ జయశంకర్ సార్ అని, తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని కొనియాడారు. ఆయనతో పాటు హై స్కూల్ ప్రధానోపాద్యులు రాంబాబు, మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది, ప్రింట్ & ఎలక్ట్రానిక్ పాత్రికేయులు తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తెలంగాణ గీతాన్ని ఆలపించి పుష్పాంజలితో ఘన నివాళులర్పించారు.
Navigation
Post A Comment: