మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 16, గాలివానల బీభత్సం మూగజీవాల పాలిట శాపంగా మారింది. మండలంలోని సూరారం గ్రామంలో చింత చెట్టు పడి 4 పశువులు మృతి చెందిన సంఘటన మరువకముందే ఇదే మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పరిసర వ్యవసాయ పంట పొలాల్లో బుధవారం రాత్రి గాలివానకు విద్యుత్ వైర్లు తెగి పడడంతో మేత కొరకు వెళ్ళిన 4 పశువులు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ శాంతిలాల్ సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ శాఖ ఏఈ రఘురామయ్య, మరియు పశుసంవర్ధక శాఖ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ యుగంధర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ పశువులు కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోతు లక్ష్మా, భూక్య బాలు, ధారావత్ దేవా, ధర్మసోత్ సునీత లకు చెందిన పశువులు గా గుర్తించారు. బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
Post A Comment: