- ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా వాలీబాల్ క్రీడలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని పాపాయిగూడెం గ్రామంలో పోలెబోయిన వారి ఇలవేల్పుల జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా.కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు పాల్గొన్నారు అనంతరం దేవుని గుడి అభివృద్ధికి రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష ఆర్థిక సహాయం అందజేసి ఆదివాసి సంప్రదాయం దీంతో స్థానిక ప్రజలు యువతతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సాంప్రదాయాలను వేల్పుల ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రేగా కాళిక సర్పంచ్ పోలెబోయిన. పాపమ్మ చిరుమళ్ళ సర్పంచ్ పాయం నరసింహారావు గ్రామస్తులు యువత పాల్గొన్నారు.
Post A Comment: