మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రైతులకు మెరుగైన సాగు సేవలు అందించాలి అనే ఉదేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రెవేశా పెట్టిన "మేనేజ్" ద్వారా డీలర్లకు వ్యవసాయ విద్య అనే దేశీ కోర్స్ ని పూర్తి చేసిన జిల్లాలోని ఎరువుల డీలర్స్ కి కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ చేతుల మీదుగా డిప్లమో సర్టిఫికెట్స్ ని అందచేశారు. ఇదే కోర్సులో అశ్వారావుపేట చెందిన ప్రముఖ విత్తనముల డీలర్ సంకురాత్రి సతీష్ జిల్లా స్థాయిలో మూడో స్థానం సాధించారు. సతిష్ కి డిప్లమో తో పాటు బ్రోన్జ సర్టిఫికెట్ను కొత్తగూడెం కలెక్ట్రెట్ లో ప్రదానం చేశారు. ఈ కోర్సు చేయడం వల్ల రైతులకు మంచి విలువైన సలహాలు ఇవ్వడానికి ఉపయోగ పడుతుందని సతీష్ తెలిపారు.
Post A Comment: