గుండాల జూన్ (మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ చిన్న పాక ఎమ్మెల్యే రేగ కాంతారావు నాయకత్వం లోనె ఆళ్లపల్లి మండల అభివృద్ధి జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆళ్ల పల్లి జడ్ పి టి సి, మర్కోడు ఎంపీటీసీ నిధులతో సి సి రోడ్డు గ్రావెల్ రోడ్ లను వేయడం జరుగుతుందని వారు అన్నారు. మండలంలోని రహదారులు అన్నిటికీ ధర మహర్దశ పట్టిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రహదారులను సిసి రోడ్లు వేయడం జరిగిందని వారు అన్నారు. మండల అభివృద్ధి రేగా కాంతారావు తోనే సాధ్యం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ నారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, నరెడ్ల ప్రవీణ్ కుమార్, ఆదాం ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: