మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గ్రామంలో రైతులకు ఖరీఫ్ సీజన్లో అవసరమైన విత్తనాలు ఎరువులు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం (AIKMS)ముద్రించిన కరపత్రాలను సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా డివిజన్ నాయకులు సాయన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిషేధించిన ప్రోడక్ట్ లను పెట్టుబడిదారులు రైతులు మోసం చేసి అమ్మకాలు సాగిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు రైతాంగానికి స్వామినాథన్ సిఫార్సు చేసిన ప్రకారం పంట మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లో అఖిల భారత రైతుకూలీ సంఘం సభ్యులు కన్నయ్య, రామ్ శెట్టి, రోజా, శ్రీనివాసరావు, పున్నమ్మ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: