మన్యం టీవీ దుమ్ముగూడెం ::
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి లో భాగంగా 12వ రోజు మండలంలోని కొత్తదనం పంచాయతీ సీతారాంపురం గ్రామంలో అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు మొదట సీతారాంపురం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేసి, మండల ప్రాథమిక పాఠశాల కొత్తదనం ఉన్న అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులతో ఇంగ్లీష్ అక్షరాలను వ్రాయించారు. పల్లె ప్రగతి లో భాగంగా ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తులతో పలు సమస్యలపై చర్చించి స్మశాన వాటిక రహదారి ఏర్పాటు, నీటి వసతి కోసం బోరు బావి నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి మెయిన్ రోడ్డు నుండి రహదారి ఏర్పాటు మొదలైన సమస్యలు చర్చించి ఆ పనులు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు తెల్లం సీతమ్మ, యం పి పి రేసు లక్ష్మి, ఎంపీడీవో చంద్రమౌళి, ఎమ్మార్వో చంద్రశేఖర్, ఎం పీ ఓ ముత్యాలరావు, సర్పంచ్ పూజారి క్రిష్ణవేణి,యం పి టి సి వంశీక్రిష్ణ, ఏ పీ ఓ సుకన్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యాలు, కార్యదర్శి కనితి రాముడు, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: