మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీ పరిధిలోని బిజీ కొత్తూరు గ్రామం లోని గుర్రపు రాజిరెడ్డి మనోవేదనతో చనిపోయారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాజిరెడ్డి కూతురు మమత ను బూర్గంపాడు మండలం లక్ష్మి పురం గ్రామానికి చెందిన భీష్మా రెడ్డికి ఇచ్చి వివాహం చేసినారు, వారికి ఇద్దరు పిల్లలు, భీష్మ రెడ్డి పత్రిక విలేకరిగా బిజీ కొత్తూరు లోనూ మామ ఇంటి దగ్గర నివాసం ఉంటున్నాడు. గత రెండు నెలల క్రితం 13వ తారీకు లారీ యాక్సిడెంట్ లో భీష్మ రెడ్డి చనిపోయినాడు. అప్పటినుండి బిజీ కొత్తూరు నందు కూతురు మమత పిల్లలు పుట్టింటి వద్ద రాజిరెడ్డి దగ్గరే ఉంటున్నారు వారి ఆర్థిక పరిస్థితిని చూసి తీవ్ర మనోవేదనకు గురై నిన్న సోమవారం చనిపోయినాడు. అతనికి మగ సంతానం లేనందున కూతురైన మమత తలకొరివి పెట్టినది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి,ఆకిటి రవీందర్ రెడ్డి పగడాల కర్ణాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, ఆంజనేయులు, వెంకట్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: