మన్యం మనుగడ, మంగపేట.
బహుజన్ సమాజ్ పార్టీ(బి ఎస్పీ )తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు,బహుజన రాజ్యాధికార రథసారథి డా :ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర 300 రోజుల యాత్రలో భాగంగా బాగంగా ములుగు జిల్లా మంగపేట మండలంలో ఈ నెల 16,17 తారీకులలో రెండు రోజులు మంగపేట మండలం బ్రహ్మణపల్లి చెక్ పోస్ట్ నుండి కమలాపురం వరకు బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతుంది.మంగపేట మండలంలోని బీఎస్పీ పార్టీ నాయకులు,గురుకులాలో చదువుకున్న స్వేరోస్ విధార్థిని, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఎస్సి ఎస్టీ ,బీసీ ,మైనారిటీ,అగ్రవర్ణ పేదలు,మెరుగైన సమాజం కోసం పాటుబడే అభ్యుదయ వాదులు,ప్రజాస్వామిక వాదులు,అన్నివర్గాల బహుజన ప్రజలు బహుజన రాజ్యాధికార యాత్రలో అధిక సంఖ్యలో హాజరైన యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి ఎస్పీ ములుగు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎంపెళ్లి వీరస్వామి,బీఎస్పీ ములుగు జిల్లా మీడియా ఇంచార్జీ జైబీమ్ రాంమోహన్,బి ఎస్పీ మంగపేట మండల కన్వీనర్ చప్పిడి వెంకటేశ్వర్లు,బీఎస్పీ మంగపేట మండల సెక్టార్ ప్రధాన కార్యదర్శి మంద సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: