మన్యం మనుగడ పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పోట్లపల్లి పంచాయతీ లోని పల్లె ప్రకృతి వనంలో పినపాక ఎంపిపి గుమ్మడి గాంధీ శనివారం మొక్కులు నాటారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వృక్షాలే జీవకోటికి ఆధారమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత హరం కు పెద్దపీట వేశారని అన్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ తోలెం కళ్యాణి,ఎంపిడిఓ శ్రీనివాసులు,ఉపాధి సిబ్బంది రామారావు, పంచాయతీ కార్యదర్శి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: